మంత్రి పరామర్శ

మంత్రి పరామర్శ

ముద్ర, హుజురాబాద్: మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మామ గందె సాంబయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుం సభ్యులను అడిగి తెలుసుకొని ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈయన వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.