తెలంగాణ విముక్తి స్వాతంత్ర అమృత్యోత్సవంలో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవం
![తెలంగాణ విముక్తి స్వాతంత్ర అమృత్యోత్సవంలో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవం](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6506b16a3346f.jpg)
ముద్ర, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో నిజాం విముక్తి స్వాతంత్ర అమృత్యోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ని ఉత్సవ సమితి కమిటీ సభ్యులు గుండా తిరుపతయ్య ఆవిష్కరించారు, అనంతరం ముఖ్యఅతిథి కరీంనగర్ జిల్లా ప్రబారి BMS ప్రచారక్ రామ్ మనోహర్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలను అనాదిగా దెబ్బతీస్తున్న రజాకర్ల వారసులుగా రాష్ట్ర ప్రభుత్వం వవరిస్తుందని, వారి పద్ధతులు మార్చుకొని హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని రానున్న రోజుల్లో భారతదేశం ఉన్నత స్థాయిలో ఉంటుందని, రామరాజ్య స్థాపన దిశగా దేశం ముందుకు పోతుందని వారన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి రవీందర్, గుండ వరప్రసాద్, దిడ్డి మనోహర్,కూన మల్లేష్, సబిని మనోహర్, చెరుకు సోమయ్య, దూడం సాంబయ్య, ఆకుల రాజేందర్, ఫీల జయప్రకాష్, శీలం శ్రీనివాస్, బాదం రమేష్, శ్యామ్ జి, అనిల్ జి, యమసాని రమేష్, ఎక్కడి రఘుతం రెడ్డి, కేతిపల్లి మాధవరెడ్డి, సందిరి సారంగపాణి, గందె రఘు తదితరులు పాల్గొన్నారు.