చెరువును తలపిస్తున్న ఇల్లు

చెరువును తలపిస్తున్న ఇల్లు

శంకరపట్నం ముద్ర జులై 4 శంకరపట్నం మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి మురికి కాలువ నీరు తొడవడంతో ఎస్సీ కాలనీకి చెందిన దేవునూరి కుమార్ నివసిస్తున్న ఇంటిలోనికి నీరు ప్రవేశించి చెరువును తలపించింది. ఇంటిలోని సామాగ్రి మురికి నీటిలో తడిసి పనికిరాకుండా పోయాయని ఆయన విలపిస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని అయన అన్నారు. తన ఇంటి పక్కన గల మురికి కాల్వలో నీరు నిండి బయటకు వెళ్లే వీలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.