శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పొన్నం

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పొన్నం

చిగురుమామిడి ముద్ర న్యూస్: మహా శివరాత్రి సందర్భంగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలోని శివాలయంలో పరమశివున్ని దర్శనం చేసుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులందరికీ అయన మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ నందీశ్వరునికి అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఆయనతో దర్శించుకున్న వారిలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిటిమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఓరుగంటి భారతీదేవి,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి బోయిని నరేష్, బీసీ సెల్ అధ్యక్షులు పొన్నం  సంపత్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్,నాయకులు వంగ కనుకయ్య, పూల లచ్చి రెడ్డి, సంజీవ్, యువజన నాయకులు  మిట్టపల్లి ఆదర్శ్,  ఎన గందుల లక్ష్మణ్,  కక్కెర్ల  సంపత్ గౌడ్, బోయిని  వేణు, ఠాకూర్  నరేందర్ సింగ్, పీచు మల్లారెడ్డి, వరుకోలు సంతోష్, నరసింహారెడ్డి, జిల్లెల్ల సంజీవ్ ఉన్నారు.