మోడీ దిష్టిబొమ్మ దగ్దం

మోడీ దిష్టిబొమ్మ దగ్దం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రాహుల్ గాంధీ అనర్హత పై  వేసిన స్టే పిటీషన్ ను గుజరాత్ హై కోర్టు తిరస్కరించింది.ఈ నేపధ్యంలో బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ లో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వంత పాడుతూ లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చడంపై   పార్లమెంటులో రాహుల్ గాంధీ నిలదీస్తే సమాధానం చెప్పకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి దేశ వ్యాప్తంగా వస్తున్న ప్రజాదారణ చూసి తట్టుకోలేక మోడీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని  అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేంద్రం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారికి తగిన మూల్యం  తప్పదనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ నాయక్,ఎం డి తాజ్,సమధ్ నవాబ్ శ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,బత్తినీ చంద్రయ్య గౌడ్, గడ్డం విలాస్ రెడ్డి,దన్న సింగ్,ఎం డి చాంద్,షబానా మహమ్మద్,ముల్కల కవిత,ముక్క భాస్కర్, పోరండ్ల రమేష్,దండి రవీందర్,షేక్ శేహెన్ష,నెహాల్ అహ్మద్,సలిమొద్ధిన్,సిరాజొధ్ధిన్,రాజ్ కుమార్,తమ్మడి ఎజ్రా,ముల్కల యొన, బషీర్,కమల్,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.