కరీంనగర్ రవాణా శాఖ వార్షిక ఆదాయం 303 కోట్లు డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్
![కరీంనగర్ రవాణా శాఖ వార్షిక ఆదాయం 303 కోట్లు డిటిసి మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6427d02334043.jpg)
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కు 2022-23 సంవత్సరానికి 303 కోట్ల 39 లక్షలు సమకూరిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.
త్రైమాసిక పన్నుల ద్వారా 58 కోట్ల 78 లక్షలు ,జీవితకాలపు పన్నుల ద్వారా 184 కోట్ల 48 లక్షలు ,ఫీజు ల ద్వారా 40 కోట్ల 48 లక్షలు, సర్వీస్ చార్జీల ద్వారా 9కోట్ల 40 లక్షలు తనిఖీ ల రూపం లో 10కోట్ల 25లక్షలు ఆదాయం చేకూరిందని తెలిపారు.
జిల్లాల వారిగా కరీంనగర్ జిల్లాకు 149 కోట్ల 40లక్షలు, జగిత్యాల జిల్లాకు 50 కోట్ల 96 లక్షలు, పెద్దపల్లి జిల్లా కు 69కోట్ల 97 లక్షలు, సిరిసిల్లా జిల్లాకు 33కోట్ల 6లక్షలు ఆదాయం సమకూరిందని చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.
ఈ ఆదాయం 2021-22 సంవత్సరం తో పోలిస్తే 2022-23 లో 54% వృద్ధి రేటు సాధించామని మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు