పర్మిట్ రూంలో మర్డర్

పర్మిట్ రూంలో మర్డర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ రాంనగర్ లోని వైన్ షాప్ పర్మిట్ రూమ్ వద్ద మద్యం మత్తులో గొడవ జరిగింది. ఇది ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఘటన కరీంనగర్ లోని రాంనగర్ వైన్స్ పర్మిట్ రూంలో చోటుచేసుకుంది.  మద్యం సేవిస్తున్న సమయంలో కొంతమంది యువకుల మధ్య గొడవ జరిగింది. అది  ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పవన్ అనే వ్యక్తికి తగిలిన గాయాలతో కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 12 గంటల సమయంలో మృతి చెందాడు. మృతుని భార్య కొద్దికాలం క్రితమే కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందింది. మృతుడు పవన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న  కుటుంబ సభ్యులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.