కృష్ణ జ‌న్మభూమి వ‌ద్ద  కూల్చివేతలు

కృష్ణ జ‌న్మభూమి వ‌ద్ద  కూల్చివేతలు
  • తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న శ్రీ కృష్ణ జ‌న్మభూమి స‌మీపంలో నాయి బ‌స్తీలో రైల్వే శాఖ అక్రమ  నిర్మాణాల‌ను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్‌ను నిలిపివేయాల‌ని సోమవారం  సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప‌ది రోజుల పాటు కూల్చివేత ప్రక్రియను నిలుపుద‌ల చేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో స్పష్టం చేసింది. 66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిష‌న్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బ‌స్తీ ప్రాంతంలో త‌మ కుటుంబాలు 1880 నుంచి నివ‌సిస్తున్నట్లు పిటీష‌న్‌లో తెలిపారు. ఆగ‌స్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ తొల‌గింపు ప్రక్రియ  చేప‌ట్టింది.  ఈ కేసులో వ‌చ్చే వారం మ‌ళ్లీ వాద‌న‌లు కొన‌సాగున్నాయి. షా త‌ర‌పున సీనియర్ న్యాయ‌వాది ప్రశాంతో చంద్ర సేన్ వాదిస్తున్నారు.  కౌశిక్ చౌద‌రీ, రాధా తార్కర్​ ,   ఆర‌న్ షాలు అడ్వకేట్లుగా ఉన్నారు.  స్థానిక సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. షా మాత్రం సుప్రీంను ఆశ్రయించారు.