ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం

చిగురుమామిడి ముద్ర న్యూస్:కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత స్టే పిటీషన్ ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ కుట్టలో భాగమని ఆరోపిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ... దేశంలో అత్యంత ప్రజాధరణ పొందుతున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకుంటుందని, ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందని, ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తే రానున్న రోజుల్లో దేశ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  చిటుమల్ల  రవీందర్,  జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత,నాయకులు గాజపాక సునీల్,పోలు శ్రీనివాస్, ఐరెడ్డి రాజిరెడ్డి, బండ సంపతి,  భగవాన్ రెడ్డి, మోసాపురి తిరుపతి,  భగవాన్ ప్రసాద్, చంచల ప్రభాకర్, బాలకృష్ణమాచారి,  వెంకటేష్   రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.