భారీ అగ్ని ప్రమాదం

భారీ అగ్ని ప్రమాదం

కాలి బూడిద అయిన ట్రాక్టర్

ఇల్లందకుంట, ముద్ర  : కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డలోడుతో ఉన్న ట్రాక్టర్ అగ్నికి ఆహుతి అయింది. స్థానిక  కోడం వీరస్వామి పశుగ్రాసం కోసం వరి కట్టలను ట్రాక్టర్ లో  నింపి రవాణా చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలని అదుపులోకి తెచ్చారు. అప్పటికే ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదం వలన రైతుకు తీవ్ర నష్టం జరిగింది.