సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ
![సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_641d692a70237.jpg)
ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఇస్కాన్ సంస్థ నిర్వహించిన వాల్యూస్ ఒలంపియాడ్ పోటీ పరీక్షలో మంకమ్మ తోట, భగత్ నగర్ లోని సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సిద్ధార్థ హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ 9వ తరగతి చదువుతున్న సిహెచ్ సాయి గుణదీప్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లో నిలిచి సైకిల్ బహుమతిగా గెలుపొందాడు. అలాగే ఆరవ తరగతి చదువుతున్న ఎస్ ఉజ్వల రూప నాలుగవ స్థానంలో నిలిచి పెన్ డ్రైవ్ గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. భారతీయ సంస్కృతి రూపకల్పనలో భాగమైన భగవద్గీత అనుసంధానంతో పరీక్షలు నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విలువలతో విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచే ఇస్కాన్ సంస్థ పరీక్షలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్కారంతో కూడిన విద్యతోనే సార్ధకత చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు