రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే డా.రాజయ్య

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే డా.రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగానికి బేసారత్ గా క్షమాపణ చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి రైతు వేదిక వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలన్నారు. 

వ్యవసాయ రంగానికి మూడు గంటల కరెంటు అంటున్న కాంగ్రెస్ కు ఎన్నికల్లో సమాధి తప్పదు అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ జడ్పిటిసి మారుపాక రవి, ఎంపీపీ రేఖ గట్టయ్య, ఎంపీటీసీలు రాజు, దయాకర్, సర్పంచ్ సురేష్ కుమార్, ఆకుల కుమార్, తోట సత్యం, గుర్రపు శ్రీనివాస్, మారపల్లి ప్రసాద్, కొలిపాక వేణు తదితరులు పాల్గొన్నారు.