ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా యాదగిరి

ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా యాదగిరి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివుని పల్లి గ్రామానికి చెందిన గోరంట్ల యాదగిరిని నియమించినట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు  బండా ప్రకాష్ ముదిరాజ్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనీ యువత, మహిళా విభాగాల కమిటీలను నిర్మాణం చేయడంలో నా వంతు పాత్రను పూర్తి చేస్తానని, నాకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, గుండ్లపల్లి శ్రీనివాస్  యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జగన్, జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య, ప్రధాన కార్యదర్శి కట్ల సదానందం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బుస్సా మల్లేశం, డైరెక్టర్ నీల రాజు, జిల్లా కార్యదర్శి భూర్ల శంకర్, నీల రాజు, చిక్కుడు రాములు కు కృతజ్ఞతలు తెలియచేశారు.