బొడ్రాయి వేడుకలకు సర్పంచ్ ₹ 2 లక్షల విరాళం!

బొడ్రాయి వేడుకలకు సర్పంచ్ ₹ 2 లక్షల విరాళం!

కేసముద్రం, ముద్ర: గ్రామంలో జరిగే బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలకు రెండు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి నిర్వాహకులకు రెండు లక్షల రూపాయల నగదు అందజేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహముద్ పట్నంలో ఆదివారం జరిగింది. గ్రామంలో వచ్చే నెలలో బొడ్రాయి ప్రతిష్టాపన చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు విరాళాల సేకరణలో భాగంగా గ్రామ సర్పంచ్ శతకోటి సారమ్మ తాను రెండు లక్షల రూపాయలను బొడ్రాయి ప్రతిష్టాపన కోసం ఇస్తున్నట్లు ప్రకటించి, అప్పటికప్పుడే నగదును నిర్వాహకులకు అందజేసారు.