భర్త అత్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త అత్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

కేసముద్రం, ముద్ర: భర్త, అత్త వేధింపులతో వేగలేక ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయపర్తి కి చెందిన రజితతో శ్రీరామగిరికి చెందిన పోరండ్ల సతీష్ కు వివాహం జరిగింది.

ఇద్దరు సంతానం తర్వాత భర్త ప్రవర్తన సరిగా లేక భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త సతీష్, అత్త ఉప్పలమ్మ తరచుగా రజితను వేధిస్తుండడంతో వారితో  వేగలేక, వేధింపులు భరించలేక  రజిత ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిందని, రజిత కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదు మేరకు భర్త సతీష్, అత్త ఉప్పలమ్మ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.