గణనాథులను దర్శించుకున్న మెదక్ ఎమ్మెల్యే

గణనాథులను దర్శించుకున్న మెదక్ ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో ప్రతిష్టించిన గణనాథులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని సత్య సాయి గణేష్ మండలి, న్యూ మార్కెట్ శివాలయం, బ్రహ్మంగారిమఠం, ఐడిఎస్ఎంటి కాలనీల వద్ద వినాయకులకు పూజలు చేశారు.

అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు వడ్డించారు. వెంట మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు రుక్మిణి కృష్ణ, లక్ష్మీనారాయణ, ఆర్కే శ్రీనివాస్ తదితరులున్నారు.