నర్సాపూర్ లో రైతుల రాస్తారోకో

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో వడ్లు తరలిoచడానికి లారీలను పంపించడం లేదని శనివారం ఉదయం రైతులు రాస్తారోకో నిర్భహించారు. రైతుల ధర్నాకు మద్దతుగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్  మురళి యాదవ్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ గౌడ్ రైతులకు మద్దతుగా బైఠాయించారు. 

బీజేపీ నాయకులు రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నర్సాపూర్ సిఐ షేక్ మదార్ సముదాయించిన వినకపోవడంతో బిజెపి నాయకులను పోలీసుస్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.