క్రిటికల్ కేర్ కు శంకుస్థాపన

క్రిటికల్ కేర్ కు శంకుస్థాపన
  • బస్తీ దవఖాన, బోటు ప్రారంభం
  • రేపు మెదక్ రానున్న మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు ఈ నెల 26న వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మెదక్ రానున్నారు. మంత్రి ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పట్టణం చేరుకొని మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తు గత సెప్టెంబర్ మాసంలో నిధులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ యూనిట్ కు మంత్రి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అంబేడ్కర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ప్రారంభిస్తారు. అనంతరం గోసముద్రం చెరువులో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరంపర శ్రీదేవి  నృత్య ప్రదర్శన కార్యక్రమానికి హాజరావుతారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వివరించారు.