మెదక్​ మహాదేవాలయంలో ఘనంగా ఈస్టర్​ వేడుకలు

మెదక్​ మహాదేవాలయంలో ఘనంగా ఈస్టర్​ వేడుకలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహాదేవాలయం(చర్చి)లో ఉదయం నాలుగు గంటల నుంచి ఈస్టర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసు పునరుత్థానము గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణంలో కోలాహలంగా మారింది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం బీదర్, మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చారు.

ప్రిసిబిటరి ఇంచార్జి శాంతయ్య భక్తులకు దైవ సందేశం అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.