ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నివాళులు

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా కొల్చారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దుర్గాగౌడ్, భార్య లావణ్యల మృతదేహాలను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నివాళులర్పించారు. ఈ ప్రమాదంలో తొలుత సోదరుడు, కుమార్తె మరణించడం తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గాగౌడ్, భార్య లావణ్యలు మృతి చెందడం పట్ల ఎమ్మెల్సీ శేరి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, బంధువులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీని చూసి విలపించడంతో ఎమ్మెల్సీ శేరి తన కన్నీటిని ఆపుకోలేక పోయారు. దుర్గాగౌడ్ తల్లి రామమ్మ తన ఇంటి దీపాలు ఆరిపోయాయని, తమ కుటుంబం మొత్తం ఆగమయిందంటూ కన్నీరు పెట్టడంతో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆమెను ఓదార్చారు.