అంకితభావంతో పనిచేయాలి
![అంకితభావంతో పనిచేయాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6464b75a936d0.jpg)
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
ముద్ర ప్రతినిధి, మెదక్: విది నిర్వహణలో పోలీసులు అంకితభావంతో పనిచేయాలని మెదక్ జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని సూచించారు. బుధవారం మెదక్ పట్టణలోని ఏ.ఆర్.హెడ్ క్వాటర్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సమాజం ఎప్పుడు సవాళ్ళు విసురుతూనే ఉంటుందని అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అనితర భాద్యత పోలీసులపై ఉంటుందన్నారు. సిబ్బంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి విది నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజల సేవలో ముందుండాలన్నారు. అలాగే సాయుద దళ విభాగం యొక్క విదులైనటువంటి విఐపి సెక్యూరిటీ, ట్రెజరీ సెక్యూరిటీ, ఖైదీలకు ఎస్కార్ట్లను అందించడం, కవాతుల్లో, గార్డ్ ఆఫ్ హానర్లో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల, అత్యవసర సందర్భంలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టం లాంటి విదులలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.
బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ల పనితీరు, టియర్ గ్యాస్ షెల్స్ వినియోగం, పోలీసు బందోబస్తు, మొదలైన అత్యవసర విదుల గురించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డి.యెస్.పి శ్రీనివాస్, ఆర్.ఐలు అచ్యుత రావ్, ఆర్.ఐ నాగేశ్వర్ రావ్, ఏ.ఆర్ ఎస్.ఐలు నరేశ్, భవానీ కుమార్, మహిపాల్, సుభాష్, హెడ్ క్వాటర్ సిబ్బంది ఉన్నారు.
జిల్లా పోలీసు ఉన్నత అధికారి,
మెదక్ జిల్లా.