పదవ తరగతి ఉత్తీర్ణతలో మెదక్ జిల్లా 13వ స్థానం

పదవ తరగతి ఉత్తీర్ణతలో మెదక్ జిల్లా 13వ స్థానం

ముద్ర ప్రతినిధి, మెదక్: పదవ తరగతి ఫలితాల్లో ఈసారి మెదక్ జిల్లా 13వ స్థానంలో  నిలిచింది. ఈ సంవత్సరం మొత్తం పదివేల 680 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9702 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 90.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5335లో 4695 పాసయ్యారు. బాలికలు 5335 పరీక్ష రాయగా 5007 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా గత ఏడాది 11వ స్థానంలో ఉండగా ఈసారి 13వ స్థానానికి దిగజారింది.