తూప్రాన్ తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

తూప్రాన్ తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

తూప్రాన్, ముద్ర: తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని తూప్రాన్ లో రైతులు డిమాండ్ చేశారు. రైతులు అరుగాలం పండించిన పంటను అమ్ముకోవడం కోసం తిప్పలు తప్పటం లేదు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని సహకార సంఘం కొనుగోలు కేంద్రంకు వడ్లు తెచ్చి 20 రోజులు అవుతున్నా వడ్లను తరలించడం లేదని, వడ్లను తరలించడం కోసం లారీలను ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్ జ్ఞానజ్యోతిని కలిసి విన్నవించగా నా చేతుల్లో ఏమిలేదు, ఎవరికైనా చెప్పుకోండని రైతుల పట్ల బాధ్యతరహిత్యంగా వ్యవహరించడంతో విసుగు చెందిన రైతులు శుక్రవారం తూప్రాన్ సుభాష్ చౌరస్తా వద్ద వడ్లు రోడ్డుపై పోసి తగలబెట్టి ధర్నాకు దిగారు. తమ పంటను అమ్ముకోవడంకోసం ఇంకేం చేయాలని తమ పట్ల తహసీల్దార్ వ్యవహరించిన తీరుకు నిరసనగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో పట్టణంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధర్నా వద్దకు అధికారులు చేరుకుని రైతులకు సర్ది చెప్పి పంపించారు.