ఎమ్మెల్యే పద్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

ఎమ్మెల్యే పద్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గంనిజాంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు, యువకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీ, సీఎం కెసిఆర్ అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  బీఅర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అందరికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎంపిపి సిద్ధిరాములు, కొండల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అమరాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.