ఊపందుకున్న భాజాపా  ప్రచారం

ఊపందుకున్న భాజాపా  ప్రచారం
  • కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేరవేత

ముద్ర, ఎల్లారెడ్దిపేట :-కేంద్ర  ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు అభివృద్ధి పథకాలను ఇంటింటికి చేరవేసే కార్యక్రమం ఆదివారం మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో  ఊపందుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో  పదిర హరిదాస్ నగర్, కోరుట్ల పేట,నారాయణపురం గ్రామంలో ఇంటింటికి మహాజన్ సంపర్క్ అభయాన్ లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాసిరిసిల్ల నియోజకవర్గానికి నియమించిన విస్తరాక్ నాగరాజు, అసెంబ్లీ కన్వీనర్ కార్ండ్ల మల్లారెడ్డి  పాల్గొని మాట్లాడుతూ గ్రామస్థాయిలో బూతులను బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణలు రూపొందించుకోవాలని కార్యకర్తలు నాయకులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పాలనను ఎప్పటికప్పుడు ఎండ కడుతూ ప్రశ్నించాలన్నారు.  ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జులు సల్ల సత్యం రెడ్డి,వంగల రాజిరెడ్డి, గుమ్మడి స్వామి, రేపాక రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి,మురళి, సాగర్, రవి, బాబు పరశురాం రెడ్డి,గుల్లపల్లి నరేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.