సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు...

సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు...
  • ఎస్పీ అఖిల్ మహాజన్...

ముద్ర ప్రతినిధి రాజన్న సిరిసిల్ల:జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ ఆఫీసు లో  160 హోం గార్డ్స్ సిబ్బందికి షూ ను ఎస్పీ అఖిల్ మహాజన్  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని,సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా హెల్త్ క్యాంపు లు,యోగ క్లాస్ లు నిర్వహిస్తున్నామని అన్నారు.విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంగా ఉండుట కూడా ముఖ్యమని సిబ్బంది  ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని అందుకోసం యోగ, వ్యాయామాలు రోజు వారి దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు. బందోబస్తులు నిర్వహించే  సమయల్లో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి,హెడ్ కానిస్టేబుల్  రవీందర్,హోం గర్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.