సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

ముద్ర సిరిసిల్ల టౌన్:-కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మంగళవారం సమావేశం నిర్వహించి ఓటర్ల ముసాయిదా జాబితాను వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 2,33,115 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,14,370 మంది పురుష ఓటర్లు, 1,18,639 మంది మహిళా ఓటర్లు, 106 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాలు, మార్పులు చేర్పులు, ఓటరు నమోదు చేసుకోవచ్చని, అక్టోబర్ 4న తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అన్నారు.