వైద్యులు దేవుళ్ళతో సమానం - ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్

వైద్యులు దేవుళ్ళతో సమానం - ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్

ముద్ర, ఎల్లారెడ్దిపేట : వైద్యులు దేవుళ్ల తో సమానమని ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తున్న  ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ డాక్టర్ సత్యనారాయణ స్వామి ని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్,  బి.ఆర్.ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డిలు కలిసి శనివారం శాలువతో సత్కరించి సన్మానం చేశారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో  మౌలిక వసతులు కల్పించి వెంటిలేటర్ సహాయంతో  చికిత్స అందించిన మహనీయుడు డాక్టర్ సత్యనారాయణ స్వామి అని కొనియాడారు.  అత్యంత కార్పొరేట్ వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించి మండల ప్రజలకు సేవ చేస్తున్నారని అదేవిధంగా తన స్వగ్రామమైన పదిర గ్రామాన్ని  దత్తత తీసుకొని  మెరుగైన వైద్యం గ్రామ ప్రజలకు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మజీద్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎస్టి సెల్ మండల అధ్యక్షులు భూక్యాసిత్యానాయక్, ఎంపీటీసీ ఎనగందుల అనసూయ, టిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా,కేబుల్ టీవీ ఆపరేటర్ రవి, బందారపు బాల్ రెడ్డి, గోష్క దాసు తదితరులు పాల్గొన్నారు.