ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్షలు - ఎల్లారెడ్డిపేట మండలంలో 5 పరీక్ష కేంద్రాలు
![ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్షలు - ఎల్లారెడ్డిపేట మండలంలో 5 పరీక్ష కేంద్రాలు](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_649fdc2c4b522.jpg)
ముద్ర,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన గ్రూప్ 4 పరీక్ష కేంద్రాలకు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షా రాస్తున్నారు. మండలంలోని గాయత్రి డిగ్రీ కళాశాల, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, రాచర్ల జూనియర్ కళాశాల, రాచర్ల బొప్పాపూర్ లోని జ్ఞాన దీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో గ్రూప్ ఫోర్ పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి ప్రహార కాస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి స్కాడ్స్ బృందం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తుంది. కాగా పరీక్ష కేంద్రాలలో మహిళలు పరీక్ష రాస్తున్నందున వారి పిల్లలను తండ్రులు చెట్ల కింద ఎదురుచూపులతో చూస్తున్నారు.