గాయపడిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

గాయపడిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఎల్లారెడ్డిపేట దోస్త్ యూత్
ముద్ర, ఎల్లారెడ్దిపేట : కారు ప్రమాదంలో పక్షం రోజుల క్రితం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న  మోసి కుటుంబానికి శనివారం 7 వేల ఆర్థిక సహాయం అందజేశారు.  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దోస్త్ యూత్ మిత్రులు తలా ఇంత 7వేల నగదును జమ చేసి మోసి ఇంటికి వెళ్లి పరామర్శించి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు  చందనం శివరామకృష్ణ అంబటి విజయ్, కుమార్, మేగి రాజు, తాటి రవి,ఈసారి కిరణ్, బడుగు భగత్ తదితరులు పాల్గొన్నారు.