పేదల ప్రజల పెన్నిధి వైఎస్సార్

పేదల ప్రజల పెన్నిధి వైఎస్సార్

కాంగ్రెస్ నేత శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజారంజకంగా పాలన సాగించిన వైఎస్సార్ అమరుడని కాంగ్రెస్ నాయకుడు కూచాడి శ్రీ హరి రావు అన్నారు. వైఎస్సార్ 74వ జయంతి వేడుకలను తన నివాసంలో శనివారం జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వై.యస్  రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1500 కిలోమీటర్లు పాద యాత్ర చేసి ప్రజల కష్టాలను చూసిన వ్యక్తి వైఎస్సార్ అన్నారు.తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచిపోతారని అన్నారు. రైతులకు రుణ మాఫీ,ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయిబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు,యూనివర్సిటీల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు,పాల్గొన్నారు.