అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం సంగంపేట శివారులో ఉన్న గుట్టపై మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసుల అందించిన వివరాల ప్రకారం సంఘం పేట్ గ్రామానికి చెందిన సాయికుమార్(22) హోలీ పండుగ సందర్భంగా అక్కపూర్ కు చెందిన యువకులతో హోలీ వేడుకల అనంతరం విందులో పాల్గొన్నారు. అనంతరం రాత్రి సంఘం పేట్ గుట్టమీద ఘర్షణ జరుగుతుండగానే అక్కడ ఉన్న సాయికుమార్ కిందపడి మృతి చెందాడు. ఈ ఉదంతం తెలిసిన ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది