అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాం - ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్

అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాం - ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రి ఇతోధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ శనివారం ఖానాపూర్ లోని రాంనగర్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసిన ప్రతులను ఆమె స్థానిక నాయకులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు