బిజెపి కలెక్టరేట్ ముట్టడి లో ఉద్రిక్తత...

బిజెపి కలెక్టరేట్ ముట్టడి లో ఉద్రిక్తత...
  • పోలీసులకు బిజెపి కార్యకర్తలు మధ్య తోపులాట...
  • పోలీస్ వాహనమెక్కి బిజెపి నాయకులు ఆందోళన...

ముద్ర ప్రతినిధి జగిత్యాల: టీఎస్ పి ఎస్సీ పేపర్ లీకేజీ నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు బిజెపి శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. దీంతో పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో ఎక్కించగా,  బిజెపి నాయకులు వాహనాన్ని అడ్డుకొని వాహనం పైకి ఎక్కి ఆందోళన చేశారు. బిజెపి నాయకులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ లీకేజీలకు బాధ్యుడిగా అయినా ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే బర్త్ రప్ చేయాలని, టిఎస్పిఎస్సి పరీక్షలు రాసిన నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి రూపాయలు లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా , మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, బిజెపి నాయకులు మదన్మోహన్, పన్నాల తిరుపతిరెడ్డి, సురబి నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.