బాధితకుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ...

బాధితకుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ...

ముద్ర, మల్యాల: మల్యాల మండల కేంద్రంలోని ఓ డ్రెస్సెస్ లో రెండు రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదం ఘటనను మంగళవారం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. దాదాపు 15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని మోహన్ జీవన్ రెడ్డికి తెలిపాడు. అనంతరం ఎమ్మెల్సీ స్థానిక తహసీల్దార్ సుజాతతో ఫోన్లో మాట్లాడగా, ఇప్పటి వరకు అగ్ని ప్రమాదం ఘటన తన దృష్టికి రాలేదని తహసీల్దార్ పేర్కొనడంతో అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, తాటిపల్లి చారీ, ఎండీ ఇమామ్, తదితరులు ఉన్నారు.