సాయి ఆలయంలో ఘనంగా బాబా పాదుకల సేవ...

సాయి ఆలయంలో ఘనంగా బాబా పాదుకల సేవ...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని  శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో వైభవంగా బాబా పాదుకల, పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ఆలయం పక్షాన అన్న దానం నిర్వహించారు.

జగిత్యాల జిల్లా గ్రంధాలయం ఛైర్మన్ డాక్టర్ గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం, బాబా పాదుకల, పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మార కైలాసం, అయిల్నేని రాం కిషన్ రావు, కళాశ్రీ గుండేటి రాజు, తవుటు రవి చంద్ర, పూజారులు వేణు మాధవ చార్య, రాజేశ్వర్ శర్మ, పంజాల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.