ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

ముద్ర, మల్యాల: మండలంలోని రాజారo వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గురువారం రాత్రి ఆటో బోల్తా పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దుట్ల గ్రామంలో జరిగిన పోచమ్మ బోనాల సందర్బంగా బంధువుల ఇంటికి వచ్చి, తిరిగి ఆటోలో వెళ్తుండగా... కరీంనగర్-జగిత్యాల రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో జగిత్యాల ప్రాంతంలోని హస్నాబాద్ కు చెందిన వజ్ర అనే మహిళతోపాటు, దేవయ్య అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే  వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది చంద్రశేఖర్, ఖయ్యుమ్ అలీ తెలిపారు. ఆటోలో మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండగా, డ్రైవర్ మద్యం సేవించినట్లు స్థానికులు తెలిపారు.