రాష్ట్రస్థాయి పోటీలకు ఎంఎస్ అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంఎస్ అకాడమీ విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, మెదక్:స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ అండర్ -17 విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంఎస్ క్రికెట్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం సిద్దిపేటలో జరిగిన ఎంపిక పోటీల్లో అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పట్లోళ్ల రిత్విక్ రెడ్డి, నవీన్, సఫాన్, ఫస్ట్ స్టాండ్ బైగా సయ్యద్ ముదాసిర్ లు ప్రతిభ కనబరిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా జట్టులో వీరికి చోటు లభించింది. త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు తరపున పాల్గొననున్నారు. క్రీడాకారుల ఎంపిక పట్ల అకాడమీ నిర్వాహకులు శ్రీనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కోచ్ లు చంద్రమౌళి, ఇనాములు రెహమాన్ హర్షం వ్యక్తం చేశారు.