ఆర్టీసి డ్రైవర్ నిజాయితీ

ఆర్టీసి డ్రైవర్ నిజాయితీ

10 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాల బ్యాగ్ అప్పగింత
ముద్ర ప్రతినిధి, మెదక్: విలువైన ఆభరణాలున్న బ్యాగును ఆర్టీసీ బస్సులో  మరిచిపోగా డ్రైవర్ నిజాయితీగా ప్రయాణీకురాలికి బ్యాగు అప్పగించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...
మెదక్ టు రేగోడు బస్సులో యశోద అనే ప్రయాణికురాలు కొత్వాన్పల్లి బస్ స్టాప్ లో ఎక్కి శంకరంపేటలో దిగింది.

వెంట తెచ్చుకున్న బ్యాగు మర్చిపోయింది. డ్రైవర్ శాదుల్లా డిపోకు తీసుకువచ్చి సెక్యూరిటీలో అప్పగించింది.  యశోదా అనే ప్రయాణికురాలు మెదక్ డిపోకి మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చి సెక్యూరిటి బ్రాంచ్ లో కలవగా డిఎం రవిచందర్ చేతుల మీదుగా బ్యాగును అప్పగించారు. ఆ బ్యాగులో పది తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈసందర్బంగా డ్రైవర్ షాదుల్లాను డిఎం, సిఐ, సెక్యూరిటీ బ్రాంచ్ సిబ్బంది అభినందించారు.