భూ తగాదాలతో ఒకరి హత్య

భూ తగాదాలతో ఒకరి హత్య

తూప్రాన్, ముద్ర: భూమి విషయంలో గత కొన్ని రోజులుగా తగాదాలతో ఒకరిని హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని కొనాయిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ దుర్గం లక్ష్మి నారాయణ గౌడ్ (60)కు గత కొన్ని రోజులుగా తమ భూమి విషయంలో వారి దాయాదులతో తగాదాలున్నాయి. శుక్రవారం రాత్రి మండల కేంద్రం మనోహరాబాద్ కు పని నిమిత్తం వెళ్ళి ఇంటికి వస్తుండగా దండుపల్లి వద్దకు రాగానే అడ్డగించి లక్ష్మీనారాయణ గౌడ్ పై బండ రాయితో దాడిచేసారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణను కుటుంబసభ్యులు అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఎవరు దాడిచేసారు అనే పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తెలియనుంది. నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం రప్పించారు.