ఉరేసుకుని యువకుడు మృతి
![ఉరేసుకుని యువకుడు మృతి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a2757d392ae.jpg)
తూప్రాన్ ముద్ర: బ్రతుకు దెరువు కోసం వచ్చి కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. శివంపేట మండలం గుండ్లపల్లికి చెందిన విభూతి సురేష్ (28) జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఇస్లాంపూర్ వచ్చి జీవిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో కుటుంబంలో తరచూ కలహాలు ఏర్పడంతో కలత చెంది ఆదివారం వంట కట్టేలు తెచ్చేందుకు వెళ్లి ఇస్లాంపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహంను ప్రభుత్వ అస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.