కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి
![కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642e8f74aa7a8.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని హవేలి ఘనపూర్ మండలం మద్దులవాయిలో కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీ సిబ్బంది ద్వారా పరీక్ష చేయించుకున్నారు. ప్రజలు సద్విని చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ కార్యదర్శిలకు పాఠశాలలో పచ్చదనం పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ ఎంపిపి శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ అనురాధాకృష్ణ, ఎంపీటీసీ జ్యోతి ప్రవీణ్, డిఎంహెచ్ఓ చందు నాయక్, సర్పంచులు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రావు, పార్టీ నాయకులు కుమార్, మద్దెల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.