కువైట్ లో మెదక్ జిల్లా వాసి మృతి

కువైట్ లో మెదక్ జిల్లా వాసి మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్:బతుకుదెరువు కోసం కువైట్  వెళ్లిన ప్రమాదవశాత్తు జారిపడిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన పాపయ్యగారి బాబు (30) కువైట్ కంట్రీలోని కోకాకోలా కంపెనీలో ఆరు సంవత్సరాల క్రితం వాటర్ మెన్ పనికి వెళ్లాడు. మృతుడు బాబు గత మూడు రోజుల క్రితం తాను ఉండే ఇంటి బాత్ రూమ్ లో జారి పడగా..అక్కడున్న వారు అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. మృతునికి భార్య నవిత, కుమారులు హర్షిత్,విజిత్ కుమార్,వినీష్ కుమార్ లు ఉన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకుని రావడానికి కోకాకోలా కంపెనీ యాజమాన్యం తగిన చర్యలు చేపట్టారని కుటుంబీకులు పేర్కొన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.