మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ బదిలీ

మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ బదిలీ
  • కొత్త అడిషనల్ కలెక్టర్ గా వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) రమేష్ బదిలీ అయ్యారు. రమేష్ హైదరాబాద్ ఎస్జిడిసి -యూఎల్ సికి బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అడిషనల్ కలెక్టర్ గా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేశ్వర్లు రానున్నారు. మెదక్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ గా ఎ.పద్మశ్రీ రానున్నారు. పద్మశ్రీ మహబూబ్నగర్ జిల్లా నుండిబదిలీపై వస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. కానీ ఆమె స్థానంలో మెదక్ జిల్లాకు ఎవరూ రాలేదు.