పూర్వ విద్యార్థుల సమ్మేళనం
![పూర్వ విద్యార్థుల సమ్మేళనం](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d0b7b11e844.jpg)
- 40 ఏళ్ల తరువాత కలిసిన మిత్రబృందం
ముద్ర ప్రతినిధి, మెదక్:ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దశబ్దాలు.. అంటే 40 సంవత్సరాల క్రితం ఓకే పాఠశాలలో, ఓకే తరగతిలో కలిసి చదువుకున్న వారు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడ్డారు. వారంతా ఒక్క చోట చేరి ఆనందంగా గడిపారు. మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పదో తరగతి(1982-83) బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి చేష్టాలు, కలిసి మెలిసి ఆడిపాడిన గతాన్ని గుర్తు చేసుకున్నారు.
కష్టా సుఖాలను ఒకరికొకరు పంచుకున్నారు. త్వరలోనే కుటుంబ సభ్యులతో సమ్మేళనం నిర్వహించుకొని చదువు నేర్పిన గురువులను సన్మానించుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో తొడుపునూరి సతీష్, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, సిద్దిరాములు, కామాటి కృష్ణ, వెంకటేశం, రాంచంద్రరెడ్డి, వినోద్, బూర్ల శ్రీనివాస్, కృష్ణాగౌడ్, విష్ణువర్దన్ రెడ్డి, రాంమోహన్, మహేశ్, కాశీనాథ్, రవీందర్, శ్రీదర్ రెడ్డి, వీర్ కుమార్, బాస్కర్, రాజశేఖర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.