సిద్దిపేటను పలకరించిన  తొలకరి జల్లు 

సిద్దిపేటను పలకరించిన  తొలకరి జల్లు 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాను తొలకరి జల్లు పలకరించింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని పలుచోట్ల చల్లని వర్షం కురిసింది. వర్షాకాలం సీజన్ లో పొలాలు దున్ని వరి నాట్లు పోయాలని ఎదురుచూస్తున్న రైతాంగానికి తొలకరి వర్షం ఊరటను కల్పించింది.జిల్లాలోని సిద్దిపేట, నారాయణరావుపేట, చిన్నకోడూర్,దుబ్బాక, నంగునూరు తదితర మండలాల్లో చల్లని వర్షం కురిసినట్లు సమాచారం అందింది.