ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన

ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో బుధవారం బొడ్రాయి ప్రతిష్టాపన వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య గ్రామస్తుల జయ జయ ధ్వనాల హోరులో ఉదయం 8:01 గంటలకు బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాజరై బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు