త్యాగాలు అమరవీరులై భోగాలు తెలంగాణ ద్రోహులై

త్యాగాలు అమరవీరులై భోగాలు తెలంగాణ ద్రోహులై

కేసముద్రం, ముద్ర: అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులు రాజబోగాలు అనుభవిస్తున్నారని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకురాలు జక్కుల కొమురక్క విమర్శించారు. ఆ పార్టీ సబ్ డివిజన్ నాయకుడు బట్టు నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొమురక్క మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ధి దినోత్సవాల్లో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను విస్మరించి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుపుకున్నా ఉపయోగం లేదని, ఉద్యమకాలంలో సబ్బండ కులాలు, జాతులు ఒక్కతాటి మీదకొచ్చి ఉద్యమాన్ని ఉధృతిని పెంచిన కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, అమరుల త్యాగాలు, ఉద్యమకారుల జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని, ఇప్పటికీ ఉద్యమకారులపై పెట్టిన కేసులు తొలగించ లేదన్నారు. ఉద్యమ కాలంలో ఉద్యమమే జీవితంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతకాని రాకేష్, మాదార్, బట్ట మేకల రాజు, తదితరులు పాల్గొన్నారు.