విభిన్న టీచర్!

విభిన్న టీచర్!

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నరసింహుల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేష్ విద్యార్థులు ధరించే తరహాలో యూనిఫాం వేసుకొని పాఠశాలకు హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి వినూత్నను చాటారు. అయితే పాఠశాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఇంకా ఏకరూప దుస్తులు పంపిణీ చేయకపోవడంతో వారంతా సివిల్ డ్రస్సుల్లో జాతీయ పతాకావిష్కరణ వేడుకకు హాజరుకాగా, ఉపాధ్యాయుడు రమేష్ మాత్రం స్కూల్ యూనిఫామ్ లో కనిపించి విభిన్నంగా నిలిచాడు.