రైతులకు చేయూతనివ్వాలి

రైతులకు చేయూతనివ్వాలి

కేసముద్రం, ముద్ర: వ్యాపారులు కార్మికులు మార్కెట్ కు వచ్చే రైతులకు అన్ని విధాలుగా చేయుత అందించాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్ అన్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా చాంబర్ ఆఫ్ కామర్స్ కు కేటాయించిన కార్యాలయాన్ని చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, అలాగే కార్మికులు, వ్యాపారులకు సైతం సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ పాలకమండలి సభ్యులు జాటోత్ హరీష్ నాయక్, కూన భద్రాద్రి, ఓలం మురళి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఓలం ప్రభు కిరణ్, జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకన్న, ట్రెజరర్ దాట్ల రమేష్, చీఫ్ అడ్వైజర్లు మంచన శీను బిజ్జాల వెంకన్న, మార్కెట్ గ్రేడ్-2 కార్యదర్శి రాజా, వ్యాపార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు